PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పవర్‌‌స్టార్‌‌ యాక్షన్‌ పీక్స్‌

1 min read

సినిమా డెస్క్​: పవర్‌‌స్టార్‌‌ పవన్‌ కళ్యాణ్‌ ‘వకీల్ సాబ్’ తర్వాత వరుస సినిమాలకు కమిట్‌ అయిన విషయం తెలిసిందే. అయితే అన్‌లాక్‌ తర్వాత సినిమాలను త్వరగా సెట్స్‌పైకి తెచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు పవన్‌. ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. వీటిలో నెక్స్ట్ వీక్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ ఫస్ట్ సెట్స్ కి వెళ్తోంది. సాగర్ కె చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కొంత షూట్ జరిగిన ఈ మూవీకి లాక్ డౌన్ తో బ్రేక్ పడింది. తిరిగి నెక్స్ట్ వీక్ 11నుంచి షూట్ రీస్టార్ట్ చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు ఇప్పటికే కన్ ఫర్మ్ చేశారు. అయితే ముందుగా ఇంటర్వెల్ సీన్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్‌ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. పవన్, రానాల మధ్య ఉండే ఈ ఫైట్ సీన్ ని సినిమాకే హైలైట్ అయ్యేలా కంపోజ్ చేస్తున్నాడు ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్. దీనికోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో పోలీస్ స్టేషన్ సెట్ వేశారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో రానా కనిపించనున్నట్టు తెలుస్తోంది . ఇగో వల్ల ఇద్దరి మధ్యా వచ్చే తగాదాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రీమేక్ స్టోరీ అయినా తెలుగు నేటివిటీగా తగ్గట్టుగా త్రివిక్రమ్ స్ర్కిప్ట్ లో కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకి ‘పరశురామ కృష్ణమూర్తి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. హీరోయిన్స్ విషయంలోనూ చాలామంది పేర్లు వినిపించాయి. ఫైనల్ గా పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జంటగా ఐశ్వర్యా రాజేష్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. సముద్రఖని, మురళీశర్మ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ మూవీ సెట్ లో కూడా త్వరలోనే పవన్ జాయిన్ అవనున్నాడట.

About Author