PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హాలీహుడ్ స్థాయికి తీసుక వెళ్లిన హీరో ప్రభాస్

1 min read

– మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: సినీ అగ్ర హీరో డార్లింగ్ ప్రభాస్ జన్మదినము సందర్బంగా అయన అభిమానులు ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమం లకు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. ముందుగా కిడ్స్ వరల్డ్ నందు వన్నె వెంకటేశ్వర్లు మరియు చిన్నా ఏర్పాటు చేసిన ప్రభాస్ చిత్ర పటాని కి పాలాభిషేకం చేసారు. అ తర్వాత నరసింహారెడ్డి నగర్ లోని అనాధ ఆశ్రమం లో అన్నదానం చేసారు. ఐదు రోడ్ల కూడలి లో బిర్యాని హోటల్ వారు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసారు. బండి మెట్ట ప్రాంతనికి చెందిన మధు మరియు అతని మిత్ర బృందం ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియచేసారు. అయన మాట్లాడుతూ తెలుగు చలన చిత్రం జాతీయ స్థాయి లో అన్ని భాషాలలో నటించి మెప్పించిన ఘనత ఒక్క ప్రభాస్ దే అని అన్నారు. నేడు యాత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు ప్రభాస్ అని అయన పుట్టినరోజు రోజున సేవా కార్యక్రమం లు నిర్వహించడం చాలా మంచిది అని అభిమానుల ను మెచ్చుకున్నారు.

About Author