PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌శాంత్ కిషోర్ కొత్త పార్టీ ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టైమ్ టు గో టు ది రియల్ మాస్టర్స్ అంటూ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ట్వీట్‌తో ‘ట్విస్ట్’ ఇచ్చారు. ప్రజలే ‘రియల్ మాస్టర్స్’ అని అర్థం వచ్చే రీతిలో… ప్రజల ముందుకు వెళ్లేందుకు సమయం ఆసన్నమైందంటూ ట్వీట్ చేశారు. పదేళ్ల రోలర్ కోస్టర్ ప్రయాణంలో ప్రజల పక్షాన విధివిధానాలు రూపొందించడం ద్వారా ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ వచ్చాను. ఇప్పుడు రియల్ మాస్టర్స్ వద్దకు వెళ్లే సమయం ఆసన్నమైంది. ప్రజలే రియల్ మాస్టర్లు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారిని మరింత బాగా అవగాహన చేసుకుని, సుపరిపాలన దిశగా అడుగులు వేయాలనుకుంటున్నాను అని పీకే ఆ ట్వీట్‌లో తెలిపారు. బీహార్ నుంచే తన ప్రయాణం మొదలుపెడుతున్నట్టు చెప్పారు.

                                               

About Author