PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం పై ప్ర‌శాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్య‌లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌పై ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. నితీశ్ కుమార్‌లో వృద్ధాప్య లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు. ఏదో చెప్పాలనుకుని, మరొకటేదో చెప్తున్నారన్నారు. ఒంటరివాడినైపోతున్నాననే బాధ ఆయనకు ఉందన్నారు. నితీశ్ కుమార్ ఇటీవల మాట్లాడుతూ, జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని గతంలో ప్రశాంత్ కిశోర్ తనను కోరారని చెప్పారు. ఈ ఆరోపణలపై ప్రశాంత్ కిశోర్ ఆదివారం ఘాటుగా స్పందించారు. నితీశ్‌పై వృద్ధాప్యం ప్రభావం చూపుతోందన్నారు. ఆయన ఏదో చెప్పాలని అనుకుంటున్నారని, అయితే వేరొకదానిని మాట్లాడుతున్నారని చెప్పారు.

                                        

About Author