PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని గుమ్మజ్ దర్గాలో ప్రార్థనలు..

1 min read

– టిడిపి ఇంచార్జి టి.జి భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని కర్నూలు నగరంలోని గుమ్మజ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. 52 రోజులుగా జైలులో ఉన్న చంద్రబాబుకి ఆరోగ్యం దెబ్బతిందన్నారు. అందుకే గుమ్మజ్ దర్గాలో చంద్రబాబు పేరు మీద ప్రార్థనలు చేశామన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్లు టి.జి భరత్ తెలిపారు. ఇక సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న క్వాష్ పిటిషన్ తీర్పులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు టి.జి భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అద్యక్షుడు నాగరాజు యాదవ్, నేతలు మన్సూర్ ఆలీఖాన్, హమీద్, జహంగీర్ బాషా, అబ్బాస్, రామాంజనేయులు, ఇబ్రహీం, మెహబూబ్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

About Author