NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రిసాల్దార్ మసీదులో టీజీ భరత్ ప్రార్థనలు

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: నగరంలోని మౌర్య ఇన్ ఎదురుగా ఉన్న రిసాల్దార్ మసీదులో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి మసీదుకు వెళ్లారు. రోజా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు పండ్లు తినిపించారు. అనంతరం నిర్వహించిన ప్రార్థనలో ఆయన కూడా పాల్గొన్నారు. రంజాన్ నెల ముస్లింలకు ఎంతో పవిత్రమైనదన్నారు. ప్రతి ఒక్కరూ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన చెప్పారు. అనంతరం ముస్లిం సోదరులతో మాట్లాడారు. అదే ప్రాంతంలో ఉన్న దుకాణదారులను కలిసి కరచాలనం చేసి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వాహిద్, టిడిపి మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు జహంగీర్ బాషా, బషీర్, మైనారిటీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్సూర్ ఆలీఖాన్, మాజీ కార్పొరేటర్, తెలుగుయువత పార్లమెంట్ అధ్యక్షుడు అబ్బాస్, తదితరులు పాల్గొన్నారు.

About Author