PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీసీలకు ప్రాధాన్యమిస్తాం: గౌరు వెంకట రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్​, గడివేముల:రాష్ట్రంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అందుకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో బీసీలకు మరోసారి అవకాశం కల్పించనున్నారన్నారు నంద్యాల పార్లమెంట్​ అధ్యక్షులు గౌరు వెంకట రెడ్డి. ఆదివారం కర్నూలులోని తన నివాసంలో నంద్యాల పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు ప్రజా వైద్యాశాల మల్లికార్జున ఆధ్వర్యలో  తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ లోగోను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా గౌరు వెంకట రెడ్డి  మాట్లాడుతూ బీసీలకు ప్రాధాన్యమివ్వని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాణ్యం టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి, మరియు నంద్యాల పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు  పార్వతమ్మ  బీసీ సెల్ నాయకులు కాసాని మహేష్ గౌడ్, రాంబాబు, కుమ్మరి సుధాకర్, కెతురు మధు, గంగాధర్ గౌడ్,BVN రాజు యాదవ్,ధనుంజయ,వెంకట స్వామి తదితరులు ఉన్నారు.

About Author