NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం : ఎంఈఓ లీల్లెమ్మ

1 min read

పల్లెవెలుగు వెబ్​: చెన్నూరు నేటి నుండి జరగబోవు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి లిల్లెమ్మ అన్నారు, మంగళవారం ఆమె పరీక్షలు జరగబోవు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, అలాగే ఆర్ఆర్ పాఠశాల 2 సెంటర్ల ను ఆమె తనిఖీ చేశారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 190 మంది విద్యార్థులు, అలాగే ఆర్ఆర్ పాఠశాలలో 150 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారని , వారికి సంబంధించిన వసతులు అన్ని కూడా సమకూర్చడం జరిగిందన్నారు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు, అనంతరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు సెంటర్ల ఇన్విజిలేటర్ల కు సమావేశం నిర్వహించి వారికి పరీక్షలకు సంబంధించిన పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రెడ్డి సెంటర్ల ఇన్విజిలేటర్లు, సూపర్డెంట్ లు పాల్గొన్నారు.

About Author