PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జంట హత్యల్లో ఏ విచారణకైనా.. సిద్ధం

1 min read

– ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
పల్లెవెలుగు కల్లూరు: కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి జంట హత్యలో తన ప్రమేయం ఉందని నిరూపించే దమ్ము ఉందా…. అని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్​కు సవాల్​ విసిరారు. పెసరవాయి గ్రామంలో పర్యటించి, హత్యల్లో వైయస్సార్ సిపి నాయకుల ప్రమేయం ఉందని చెప్పిన నారా లోకేష్ పై కాటసాని తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కాటసాని మాట్లాడారు. జంట హత్యలకు గురైన వ్యక్తులు గతంలో తన గెలుపు కోసం కృషి చేశారని, వారిని రాజకీయంగా పైకి తెచ్చింది నేనేనని పేర్కొన్నారు. వారు ఎన్నికల అనంతరం పార్టీలోకి వస్తామంటే కొన్నాళ్ళు ఆగమని చెప్పానని, ఈ నెల 7వ తేదీన కుడా ఫోనులో గ్రామ సమస్య గురించి మాట్లాడనని పేర్కొన్నారు.

About Author