PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధిత పోలీసు కుటుంబాలకు చెక్కులు అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : జిల్లా పోలీసు శాఖలో పని చేస్తూ వివిధ కారణాలతో, అనారోగ్యాలతో మృతి చెందిన బాధిత పోలీసు కుటుంబాలకు డిజిపి ఛీఫ్ ఆఫీస్ నుండి వచ్చిన భద్రత చెక్కులను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ శనివారం అందజేశారు. చాగలమర్రి పీఎస్​లో పని చేసే బి. బాలసంజన్న ఈ ఏడాది ఫిబ్రవరి 21న మృతి చెందారు. ఆయన భార్య బి.మమతకు రూ. 3,73,323 భద్రత చెక్కును అందజేశారు. అదేవిధంగా కర్నూలు టౌన్​లో పని చేసే వి. శైలజ మార్చి 6న మృతి చెందారు. ఆమె భర్త ఎం. కుమార్​కు రూ.3,99,160, నంద్యాల త్రీటౌన్​ పీఎస్​లో విధులు నిర్వర్తించే పి. వెంకటేశ్వర్లు (ఫిబ్రవరి 19న మృతి చెందారు)భార్య పి. చంద్ర కళావతికి రూ. 3,99,370 భద్రత చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఓ సురేష్ బాబు, ఎస్పీ పీఏ నాగరాజు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు ఉన్నారు.

About Author