NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ఫ‌లితాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు పోల్ అయినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ తెలిపారు. ముర్ముకు పోలయిన 540 ఓట్ల విలువ 3,78,000, యశ్వంత్ సిన్హాకు పోలయిన ఓట్ల విలువ 1,45,600గా ఆయన పేర్కొన్నారు. 15 ఓట్లు చెల్లనివిగా తెలిపారు. తదుపరి ప్రకటన కోసం వేచి ఉండాలని పీసీ మోడీ కోరారు. వీటిని తొలి రౌండ్ ఫలితాలుగా పేర్కొన్నారు.

                                       

About Author