PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ‌ట‌న్ నొక్కి ఇంటికి పంపిస్తారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అప్పులతో ఆంధ్రప్రదేశ్‌ను మరో శ్రీలంకగా మారుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. డబ్బులివ్వడానికి బటన్‌ నొక్కుతున్నానంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని.. అదే బటన్‌ నొక్కి ప్రజలు ఇంటికి పంపేస్తారని హెచ్చరించారు. గోదావరి వరదలో ప్రజల కష్టాలను చూస్తే బాధేస్తోందన్నారు. వారిని ఆదుకోకుండా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని.. జనాలను బురదలోకి తోసేసి గాలిలో తిరుగుతోందని ధ్వజమెత్తారు. నేరుగా వచ్చి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రికి, మంత్రులకు తీరిక లేదని ఆక్షేపించారు. పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని గోదావరి వరద ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించారు.

                                 

About Author