PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎండు మిర్చి ధ‌ర రూ. 27 వేలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎండు మిర్చి ధర ఆకాశమే హద్దుగా రోజురోజుకూ ఎగబాకుతోంది. తాజాగా క్వింటాల్‌ రూ.27 వేలను తాకి ఆల్‌టైం రికార్డు సృష్టించింది. నాణ్యత ఉంటే బ్యాడిగి రకం మిర్చికి ఇంకా ఎక్కువ ధరైనా ఇచ్చి కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో ఖరీ్‌ఫలో మిర్చి సాగు చేపట్టకపోవడం, అరకొరగా నాట్లు వేసిన చోట గత ఏడాది వలే నల్లి తెగులు వచ్చిందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుండటంతో మిర్చి రైతులు ఆచితూచిగా అడుగులు వేస్తున్నారు. దీంతో కొత్త పంట మార్కెట్‌లోకి రావడం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఉండటంతో ప్రస్తుతం కోల్డ్‌స్టోరేజ్‌లలో నిల్వ చేసిన మిర్చికి డిమాండ్‌ పెరుగుతోంది. గత సీజన్‌లో మిర్చి అమ్మకుండా శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకొన్న రైతులు ఇప్పుడు లాభాలు కళ్లజూస్తున్నారు.

                                            

About Author