PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పూజారికి క‌రోన‌: ఎంఐఎం నేత స‌హాయం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఎంఐఎం నేత అస‌దుద్దీన్ ఉదార‌త చాటుకున్నారు. పాత‌బస్తీలోని ఒక పూజారి క‌రోన‌ బారిన‌ప‌డ్డారు. ఆయ‌న హోం ఐసోలేష‌న్ లో ఉంటున్నారు. పూజారి అస్వస్థతకు గుర‌య్యారు. దీంతో ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు ఆస్పత్రిలో చేర్పించేందుకు ప్రయ‌త్నించారు. కానీ ఏ ఆస్పత్రిలోను బెడ్లు అందుబాటులో లేక‌పోవ‌డంతో కుటుంబ‌స‌భ్యులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. స్థానిక మ‌జ్లిస్ నేత చొర‌వ‌తో ఎంపీ అస‌దుద్దీన్ దృష్టికి స‌మ‌స్య తీసుకెళ్లారు. శాలిబండ‌లోని ఓ ఆస్పత్రిలో ఆల‌య పూజారిని చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. దీంతో ఎంపీ అస‌దుద్దీన్ మంచి మ‌న‌సును మెచ్చుకున్నారు. క‌రోన సంక్షోభం స‌మ‌యంలో కుల‌,మ‌తాల‌కు అతీతంగా ప్రజాసేవ చేయ‌డం మంచి ప‌రిణామం అని పాత‌బ‌స్తీ ప్రజ‌లు అంటున్నారు.

About Author