PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సామాన్యుడి కానుక స్వీకరించిన ప్రధాని మోదీ !

1 min read

పల్లెవెలుగు వెబ్​: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కాశీ విశ్వనాధుని నడవాను ప్రజలకు అంకితం చేయనున్నారు. ప్రధాన ఆలయానికి వెళ్తుండగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కాషాయ వస్త్రాల్లో ఉన్న ఓ వ్యక్తి కానుకలు ఇచ్చే ప్రయత్నం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా సిబ్బంది నిరాకరించగా.. మోదీ వాటిని తనకు అందించాలని చెప్పారు. అక్కడే కారు ఆపించి ఆ వ్యక్తి తీసుకొచ్చిన తలపాగా, కాషాయ వస్త్రాన్ని స్వీకరించారు. భద్రతా వలయంలోకి వచ్చి ఆ వ్యక్తి మోదీకి కానుక స్వయంగా అందించారు. దీని పై ఓ బీజేపీ నేత స్పందిస్తూ ఆయన సామాన్యుడి ప్రధాని అంటూ కీర్తించారు.

About Author