PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మన్​కీ బాత్​’లో.. ప్రధాని మనసులో మాట..

1 min read

బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమ్​కుమార్​

పల్లెవెలుగు: కోడుమూరు నియోజకవర్గం ఇంచార్జి మరియు రాష్ట్ర ఎస్సి మోర్చా ప్రధాన కార్యదర్శి మీసాల ప్రేమ్ కుమార్ ఆదేశాల మేరకు నియోజకవర్గం కన్వీనర్ ఆధ్వర్యంలో కోడుమూరు మండల అధ్యక్షులు సల్వాడి సురేంద్ర అధ్యక్ష్యతన జరిగింది ఈ కార్యక్రమానికి కర్నూల్ జిల్లా అధ్యక్షులు శ్రీ పోలంకి రామస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీసాల ప్రేమ్ కుమార్ మాట్లాడుతు ప్రతి నెలలోచివరి ఆదివారం జరిగే మన్ కీబాత్ ప్రోగ్రాం డిడి సప్తగిరి ఛానెల్లో ఉదయం 11:00 గంటల నుండి 12:00 గంటల వరకు ప్రసారం అవుతుందని ప్రతి ఒక్కరు పార్టీలకు అతితంగా జరిగే ఈ మన్ కిబాత్ కార్యక్రమం ను దేశంలో జరిగే ప్రతి గొప్ప విషయాలను మన భారత ప్రధాని  నరేంద్ర మోడీ తన మనసులో మాటగా దేశ ప్రజలతో పంచుకుంటున్నారని వివరించారు. ఏప్రిల్ 30వ తారీఖున ఈ కార్యక్రమం 100 వ ఎపిసోడ్ ప్రసారమవుతుందని సమావేశంలో తెలిపారు. మండల అధ్యక్షులు సురేంద్ర మాట్లాడుతూ పార్టీ ఆదేశాల ప్రకారం దేశం మొత్తం మీద కోడుమూరు ఈ 100 వ ఎపిసోడ్ మన్ కిబాత్ కార్యక్రమం ప్రతి నియోజకవర్గం లో వంద చోట్ల నిర్వహించే విధంగా ఆదేశాలు పంపారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ 30 వ తేదీ కోడుమూరులోని పాత బస్టాండ్ ఆవరణలో ఉదయం 11:00 నుండి 12:00 గంటలకు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ఈ సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు మరియు నియోజకవర్గం మండల నాయకులుకే కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author