PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఖైదీలు జైల్లో.. అవినీతిప‌రులు బీజేపీలో.. !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఖైదీలు జైల్లో ఉంటారని, అవినీతిపరులు మాత్రం బీజేపీలో ఉంటారని బాల్క సుమ‌న్ వ్యాఖ్యానించారు. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో బాల్కసుమ‌న్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేంద‌ర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. టీఆర్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. బీజేపీ–ఈటల రాజేంద్ర ఓటర్లను ప్రలో భాలకు గురిచేసే పనిలో పడ్డారని, చికెన్, మద్యం, నగదు పంచుతున్నారని ఆరోపించారు. దాదాపు 2000 మంది సాయుధ బలగాలను దింపి ఓటర్లను భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు.

About Author