PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ ఉద్యోగానికి ప్రైవేటు అనుభవం !

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రభుత్వ ఉద్యోగుల ఎంపికలో గోవా ప్రభుత్వం సరికొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం ఏడాది పాటు ఏదైనా ప్రైవేటు సంస్థలో పనిచేసిన అనుభవం తప్పనిసరి అని పేర్కొంది. ఈమేరకు నిబంధనలలో మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అనుభవంలేని వాళ్లను నేరుగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవడం వల్ల పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. ప్రైవేటులో అనుభవం రూల్ వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు నైపుణ్యం కలిగిన అభ్యర్థులు లభిస్తారని ముఖ్యమంత్రి వివరించారు. ఈమేరకు ఉత్తర గోవా జిల్లాలోని తలీగావ్ గ్రామంలో ప్రమోద్ సావంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్ సీ) ద్వారా చేపట్టే నియామకాల్లో ఈ రూల్ ను తప్పనిసరి చేయనున్నట్లు తెలిపారు.

About Author