NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులకు బహుమతులు అందజేత

1 min read

– కళాశాల కరస్పాండెడ్ రామచంద్రారెడ్డి..
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పట్టణంలోని కేజిఆర్ కళాశాల నందు ఇంటర్మీడియట్ ఫేర్వెల్ డే కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ సదాశివమూర్తి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల కరస్పాండెడ్ కె రామచంద్రారెడ్డి హాజరయ్యారు. అనంతరం 2022 మార్చిలో అత్యధిక మార్కులు సాధించినవిద్యార్థిని విద్యార్థులకుబహుమతులను కళాశాల కరస్పాండెడ్ రామచంద్రారెడ్డి అందజేయడం జరిగింది. అలాగే విద్యార్థిని విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి ఇష్టపడి చదవాలని అన్నారు. అలాగే విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని తెలిపారు. అలాగే తల్లిదండ్రులకు మరియు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.కార్యక్రమంలో ఉపన్యాసకులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author