PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిరుధాన్యాల ఉత్పత్తులను ప్రోత్సహించండి

1 min read

జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: జిల్లాలో చిరుధాన్యాల ఉత్పత్తులను గణనీయంగా పెంచాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ సంబంధిత రైతులను ప్రోత్సహించారు. సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాల్ ఆవరణలో చిరుధాన్యాల విక్రయ ఉత్పత్తులను జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డిలు పరిశీలించారు. మిల్లెట్ సంవత్సర సందర్భంగా జిల్లాలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణ స్థాయిని విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రైతులను ప్రోత్సహించారు. వర్షభావ పరిస్థితుల్లో  కూడా చిరుధాన్యాల ఉత్పత్తులు బాగా వస్తాయన్నారు. డిఆర్డిఎ, రైతు సాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంట ఉత్పత్తుల, తినుబండారాల స్టాళ్లను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే చిరుధాన్యాల ఉత్పత్తులను ప్రోత్సహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను సూచించారు.

About Author