PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా  పదోన్నతి

1 min read

– అభినందనలు తెలియజేసిన తోటి ఉద్యోగస్తులు, జర్నలిస్టులు..

పల్లెవెలుగు వెబ్ భీమవరం : సమాచార శాఖ డిఐపిఆర్వో కార్యాలయంలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న దాసరి నాగార్జునకు డిప్యూటీ డైరెక్టర్ గా పదోన్నత కల్పిస్తూ ఆ శాఖ ఎక్స్-అఫిషియో సెక్రెటరీ టి.విజయ కుమార్ రెడ్డి ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేశారు.  వీరు  డిప్యూటీ డైరెక్టర్ గా కాకినాడ జిల్లా కాకినాడలోని డిఐపిఆర్ఓ కార్యాలయమునకు పదోన్నతపై వెళ్ళానున్నారు.   వీరు ఏలూరు, భీమవరం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల డిఐపిఆర్ఓ కార్యాలయంలో  2019 జూలై నుండి సహాయ సంచాలకులుగా  పనిచేస్తున్నారు. అందరితో అన్ని విధాలుగా స్నేహపూర్వకంగా మెలిగేవారు. మచ్చలేని అధికారిగా ఉన్నతాధికారులచే  మన్ననలు అందుకున్నారు.  దాసరి నాగార్జున్ పదోన్నతి పై వెళ్తున్న సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల మీడియా ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది నాగార్జునకు శుభాకాంక్షలు తెలిపారు.

About Author