PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

3 నెల‌ల‌కోసారి ప్ర‌మోష‌న్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ ఐటీ సంస్థ విప్రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రికార్డు స్థాయికి పెరిగిన ఉద్యోగుల వలసలకు అడ్డుకట్ట వేసేందుకు విప్రో సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంది. ప్రతిభావంతులైన, అర్హులైన ఉద్యోగులకు ఇకపై మూడు నెలలకోసారి ప్రమోషన్లను ఆఫర్‌ చేయాలని యోచిస్తోంది. అంతేకాదు, ఈ ఏడాది సెప్టెంబరులో చాలా వరకు సిబ్బంది వేతనాలను మరో 10 శాతం పెంచాలనుకుంటోంది. అత్యుత్తమ ప్రతిభ కనబర్చేవారికి 15 శాతం వరకు హైక్‌ లభించే అవకాశం ఉంది. కరోనా సంక్షోభంతో ఐటీ సేవలకు డిమాండ్‌తో పాటు ఈ రంగ కంపెనీల్లో ఉద్యోగుల వలసలు కూడా అనూహ్యంగా పెరిగాయి. దాంతో ఐటీ కంపెనీలు జీతాల పెంపు, బోనస్‌, ప్రమోషన్లు, కొత్త టెక్నాలజీల్లో శిక్షణ వంటి ప్రోత్సాహకాలతో ప్రతిభావంతులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

                                        

About Author