PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్రాహ్మణుల శ్రేయస్సు తెదేపాతోనే సాధ్యం

1 min read

– టిడిపి బ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రాం ప్రసాద్
పల్లెవెలుగు వెబ్ కడప: రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం, శ్రేయస్సు తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ పేర్కొన్నారు. జోన్ 5 సమావేశానికి విచ్చేసిన అయన నగరంలోని సమైక్య బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు డా. గోపినాథ్, ఆడిటర్ శివరావు, అర్చక సమాఖ్య అధ్యక్షులు విజయ్, ఇతర సభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా బుచ్చి రాం ప్రసాద్ మాట్లాడుతూ నూతనంగా తెలుగుదేశం పార్టీ లో బ్రాహ్మణ సాధికార కమిటీ ని తెదేపా అధినేత చంద్రబాబు నియామకం చేపట్టారని, ఈ కమిటీ ద్వారా వెనుకబడిన బ్రాహ్మణ సమాజం లోని పేదల అభివృద్ధి, సంక్షేమం ఫలాలను మెరుగ్గా అందించేందుకు వారి సమస్యలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే కృషి చేస్తామని తెలిపారు. గత తెలుగుదేశం పాలనలో చంద్రబాబు బ్రాహ్మణులకు బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి సంక్షేమపథకాలను విజయవంతంగా అమలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణుల సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడంతో పాటు త్వరలో విజయవాడలో బ్రాహ్మణ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలోని బ్రాహ్మణులు బ్రాహ్మణ సాధికార సమితిని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బుచ్చి రాం ప్రసాద్ ను సమాఖ్య ప్రతినిధులు సత్కరించారు. సమావేశంలో కడప పార్లమెంట్ మీడియా కో ఆర్డినేటర్ జనార్దన్, టిడిపి జిల్లా లీగల్ సెల్ అధికార ప్రతినిధి ఆదినారాయణ, సమాఖ్య ప్రతినిధులు బాలకృష్ణ, బాలాజీ, మునిరామచంద్ర రావు, శంకర నారాయణ, సుధీర్, శాస్త్రి, లక్ష్మి దేవి, తదితరులు పాల్గొన్నారు.

About Author