PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రక్షణ కల్పించండి..! అమిత్​షాకు బాబు ఫోన్​

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: వైసీపీ చేస్తోన్న దాడుల నుంచి రక్షణ క్పలించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్​షాకు, ఏపీ గవర్నర్​ బిశ్వభూషణ్​కు ఫోన్​ ద్వారా కోరారు. ఈమేరకు వైసీపీ వైఖరిపై ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు నక్కా ఆనంద్​బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్​లు అటు ప్రభుత్వంపై, ఇటు ఏపీ సీఎం జగన్​పై చేసిన తీవ్రస్థాయి ఆరోపణలను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తెదేపా కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడులకు పాల్పడడంతోపాటు టీడీపీ నేతల ఇళ్ల వద్ద బఠాయింపులు, ఆందోళనలు చేపడుతున్నారు. కేంద్ర బలగాలచే భద్రత కల్పించాలంటూ చంద్రబాబు హోంశాఖను కోరారు.

About Author