PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాలల రక్షణ.. సంరక్షణ మన బాధ్యత… న్యాయమూర్తి

1 min read

– ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం ను సందర్శించిన న్యాయమూర్తి

– కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి/సీనియర్ సివిల్ జడ్జి  శ్రీ సి హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు,

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం, కర్నూలు ను సందర్శించారు, అక్కడి సౌకర్యాలు, ఆహారం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొన్నారు. అక్కడ ఉన్న పిల్లలకు అవగాహన సదస్సును నిర్వహించడమైనది. ఈ సదస్సులో కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు  బాలలకు సంబందించిన చట్టాలను, ఉచిత న్యాయ సహాయమును గురించి తెలియజేశారు. ఎవరికైనా ఉచిత న్యాయ సహాయము కావాలంటే  కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేస్తే, ఈ సంస్థ వెంటనే చర్య తీసుకుంటాదని తెలిపారు.  బాలల రక్షణ, సంరక్షణ గురించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. కార్యాలయములకు సంభందించిన రిజిస్టర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్ ఎం. హుస్సేన్ బాష, తదితరులు పాల్గొనారు.

About Author