PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న సురక్ష.. పేదలకు రక్ష..

1 min read

మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి

పల్లెవెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న సురక్ష.. పాలన వ్యవస్థలో నూతన విప్లవం తీసుకొచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి. నగరంలోని 12వ వార్డు 29వ సచివాలయంలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్వీ మోహన్​ రెడ్డి మాట్లాడుతూ జగనన్న సురక్ష…పేదలకు రక్ష అని, ఈ కార్యక్రమంతో ప్రతి కుటుంబానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. అనంతరం వివిధ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో 12వ వార్డు కార్పొరేటర్​ క్రాంతి కుమార్​, రాజ్​, షరీఫ్​, శేఖర్​, బాష, సత్యరాజ్, వనేష్​, ఎం. శేఖర్​ తదితరులు పాల్గొన్నారు.

About Author