PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెంచిన విద్యుత్ చార్జీలపై నిరసనలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి , డోన్ : డోన్ లో విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా, పెంచిన విద్యుత్ చార్జీలపై నిరసన కార్యక్రమం డోన్ మండల అధ్యక్షుడు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ పెంచిన ఛార్జిలను దగించాలని రైతులకు మీటర్లు బిగించకూడదని డిమాండ్ చేస్తున్నాము అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అబ్బిరెడ్డిపల్లె గోవింద్ ,ప్యాపిలి రామ్మోహన్ యాదవ్ , ఎల్ఐసి శ్రీరాములు , కనపకుంట మధుసూదన్ రెడ్డి , కొచ్చెరువు రామాంజనేయులు,వలసల సుధాకర్ , కృష్ణా రెడ్డి , గుండాల రంగస్వామి , వినయ్ చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author