NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలకు మెరుగైన సేవలు అందించండి

1 min read

ఏఎస్​ఓలకు కంప్యూటర్లు అందజేసిన కలెక్టర్​ జి.సృజన

పల్లెవెలుగు, కర్నూలు:  జిల్లాలోని క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో జిల్లాలోని 8 మండల  సహాయ గణాంక అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తన ఛాంబరులో కంప్యూటర్లను పంపిణీ చేశారు.  కర్నూలు ఉప గణాంక అధికారి, సహాయ గణాంక అధికారి, పెద్దకడబూరు, గూడూరు, నందవరం, కోసగి, దేవనకొండ, ఎమ్మిగనూరు, మండలాలలోని సహాయ  గణాంక అధికారులకు  అధునాతన కంప్యూటర్లను అందజేశారు. ఈ సందర్భంగా  కలెక్టర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలకు మెరుగ్గా.. వేగంగా సేవ చేయాలని  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ భార్గవ తేజ, ముఖ్య ప్రణాళిక అధికారి అప్పలకొండ, సిపిఓ కార్యాలయం సహాయ సంచాలకులు జి భారతి, కార్యాలయ సిబ్బంది ఎస్ వి రమణ, ఎస్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

About Author