NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాణ్యమైన వైద్యం అందించాలి…

1 min read

– శ్రీ జె పి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభంలో పాల్గొన్న శ్రీకాంత్ రెడ్డి.

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో:    రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.శనివారం  రాయచోటి పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో డా జయ ప్రకాష్ రెడ్డి చేనూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ జె పి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష తో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అధునాతన వసతులతో ఆసుపత్రి ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. పేదలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో మంచి సేవలు అందించి ప్రజా మన్ననలను పొందాలని  శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు. కౌన్సిలర్ పల్లా రమేష్, వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, రామాపురం వైస్ ఎంపిపి రవిశంకర్ రెడ్డి (బాబు) ,సతీష్, శ్రీనివాసులు రెడ్డి, విశ్వనాధ  పాల్గొన్నారు.

About Author