PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుటుంబానికి ఆర్థిక సహాయం అంద జేసిన సర్పంచ్

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని రోళ్లపాడు గ్రామానికి చెందిన మాల కుమ్మరి ప్రవీణ్ కుమార్(35) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఈనెల 12వ తేదీన 108 అంబులెన్స్ లో తీసుకువెళ్లి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆయన మృతి చెందారు.విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పేరెడ్డి వెంకటరామిరెడ్డి వారి ఇంటికి వెళ్లి మృతుని భార్య అయిన మాల కుమ్మరి ఎలీషమ్మకు వైయస్సార్ బీమా తక్షణ సహాయం కింద పదివేల రూపాయల నగదును బుధవారం సర్పంచ్ అందజేశారు.ఈయనకు యశ్వంత్(11),గౌతమ్(10)సంతానం ఉన్నారు.మిగతా 90 వేలు భీమా పరిహారం క్లేయిమ్ చేసినట్లు పంచాయితీ కార్యదర్శి వేల్పుల విజయ కుమారి తెలిపారు.ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ యాస్మిన్ మరియు తదితరులు ఉన్నారు.కుటుంబ యజమాని మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యుల్లో మరియు బంధుమిత్రుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

About Author