PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధిత కుటుంబానికి భద్రత చెక్కు అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు పోలీస్​ స్టేషన్​ ఏఎస్​ఐగా విధులు నిర్వహిస్తున్న ఎస్​. కృష్ణుడు జనవరి 27న అనారోగ్యంతో మృతి చెందారు. జిల్లా పోలీసు కార్యాలయంలో భద్రత ఫండ్ క్రింద వచ్చిన రూ. 4 లక్షల చెక్కును మంగళవారం ఏఎస్సై ఎస్ . కృష్ణుడు భార్య శారద కు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఓఎఓ సురేష్ బాబు, ఎస్పీ పిఎ నాగరాజు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు ఉన్నారు.

About Author