PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో సైకో పాల‌న న‌డుస్తోంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో సైకో పాలన నడుస్తుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం అనకాపల్లి పార్లమెంట్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. చో ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్ఫూర్తితో మనం ప్రజల పక్షాన పోరాటాలు చెయ్యాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడు కోవాలంటే క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో పని చెయ్యాలని సూచించారు. మూడేళ్ల జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు. డ్రైవింగ్ రాని వారిని సీట్లో కూర్చోపెడితే వెనక్కి తీసుకెళ్తారని..ఇప్పుడు జగన్ పాలన కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు.

                                                    

About Author