ప్రజాసేవయే కూటమి ప్రభుత్వ ధ్యేయం …ఆలూరు టిడిపి ఇంచార్జి
1 min read
న్యూస్ నేడు ఆలూరు : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి శుక్రవారం ప్రజాసమసస్యల పరిస్కారం కోసం చేపట్టిన గ్రీవిన్స్ కార్యక్రమంలో భాగంగా.ఆలూరు తాలూకా టిడిపి ఇంచార్జి వర్యులు బి.వీరభధ్రగౌడ్ ఆలూరు తాలూకా టిడిపి ఆఫీసులో ప్రజలనుండి అర్జీలను స్వీకరించి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కకరించటం జరిగింది.ఈకార్యక్రమంలో ఆలూరు తాలూకా అన్ని మండలాలకు చెందిన ప్రజలు ,ఆయా మండలాల టిడిపి నాయకులు కార్యకర్తలు,వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర,జిల్లా మరియు తాలూకా స్థాయి వివిధ హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు,అలాగే తెలుగుయువత, ఐటిడిపి,టిఎన్ఎస్ఎఫ్,టిఎన్టియుసి, టిడిపి శోషల్ మీడియా అలాగే టిడిపి అనుబంధ సంఘాల నాయకులు,మండల యూత్ నాయకులు అందరూ పెద్దఎత్తున పాల్గొన్నారు.
