PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగుదేశం తోనే ప్రజా సంక్షేమం… మాజీ ఎమ్మెల్యే            

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:   వెలుగోడు పట్టణంలోని సి.పి.నగర్ లో మంగళవారం సాయంత్రం ” ప్రజా వేదిక ” కార్యక్రమం నిర్వహించారు. భవిష్యత్ కు గ్యారెంటీ పథకాలు, చంద్రబాబు నాయుడు  అక్రమ అరెస్టు మరియు వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు  శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే  శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి వివరించారు.చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తే , జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని అన్నారు.ఎన్టీఆర్ తెలుగు గంగ నిర్మించి రైతులకు  సాగునీటి ని అందించి రెండు పంటలు పండించే విధంగా అభివృద్ధి చేశారన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి టిడిపి గెలుపుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు , మాజీ ఎంపిపి ఎల్లాల కృషుడు , మాజీ సర్పంచ్ అబ్దుల్ కలాం , డాక్టర్ జాకీర్ , కృష్ణా రెడ్డి , రజాక్ , శంకర రెడ్డి , ఖలీలు ల్లా ,  రామానాయుడు , నాగశేఖర్ , హిదాయత్ , రసూల్ తదితరులు పాల్గొన్నారు.

About Author