NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కనపర్తి లేఅవుట్లలో పక్కా గృహాలు నిర్మిస్తాం… : ఎంపీడీవో మహబూబ్ బీ

1 min read

పల్లెవెలుగు వెబ్​: చెన్నూరు మండలంలోని కనపర్తి లేఅవుట్లలో చెన్నూరు సచివాలయం-2 కు సంబంధించి 119 మందికి ఇంటి స్థలాలు ఇవ్వడంతోపాటు వారికి అక్క గృహ లు మంజూరు చేయడం జరిగిందని, లబ్ధిదారులు పక్కా గృహాలను వెంటనే నిర్మించుకునేందుకు వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది, హౌసింగ్ సిబ్బంది వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ డీ వో మహబూబ్ బి, స్పెషల్ ఆఫీసర్ మురళి లు అన్నారు, సోమవారం సచివాలయం,2 లో వారు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, హౌసింగ్ సిబ్బందికి సమావేశం నిర్వహించి హౌసింగ్ పై పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది, గ్రామ వాలంటీర్లు తమ పరిధిలో ఉన్న గృహ నిర్మాణ లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారికి కనపర్తి లేఅవుట్లలో ఇంటి నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని వారు తెలిపారు, ఇప్పటికే ఆ లే అవుట్  కు సంబంధించి ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, కాంట్రాక్టర్లకు అప్పగించడం జరిగింది అన్నారు, లబ్ధిదారుల తో ఈ విషయమై చర్చించి గురువారం లో గా ఎంతమంది గృహ నిర్మాణాలు చేపడతారో, ఎంతమంది చేపట్టారో, జాబితాను తమకు తెలియజేయాలని వారు తెలియజేశారు, గృహ నిర్మాణం చేపట్ట దలచినవారు వెంటనే పనులు ప్రారంభించాలని వారు తెలియజేశారు, ఈ విషయాన్ని లబ్ధిదారుల దృష్టికి తీసుకెళ్లాలని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామ సుబ్బారెడ్డి, వాలంటీర్లు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

About Author