PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరు జిల్లా రైతు సేన అద్యక్షునిగా పూజారి నిరంజన్..

1 min read

ఆక్వా రైతులను సంఘటతం చేస్తూ, వారి సమస్యలకు కృషి చేస్తా.. పూజారి నిరంజన్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : కాపుసంక్షేమ రైతుసేన ఏలూరు జిల్లా అద్యక్షునిగా ఏలూరు మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పూజారి నిరంజన్ ఎంపికైనట్లు కాపుసంక్షేమసేన జీల్లా అద్యక్షులు పులి శ్రీరాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర అద్యక్షులు చేగొండి హరిరామజోగయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పూజారి నిరంజన్ మాట్లాడుతూ రైతులను, ఆక్వారైతులను సంఘటితం చేస్తూ వారి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనకు ఈ పదవి ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే, మంత్రివర్యులు చేగొండి హరి రామ జోగయ్య కు సహకరించిన బసవ చిన్న బాబుకు, పులి శ్రీ రాముల కు నిరంజన్ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author