PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పులివెందుల టీడీపీ అభ్య‌ర్థి బీటెక్ ర‌వి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌డ‌ప జిల్లా పులివెందుల టీడీపీ అభ్య‌ర్థి బీటెక్ ర‌వినే అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. గత ఎన్నికల్లో జగన్‌పై ఇక్కడ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్సీ సతీశ్‌రెడ్డి.. ఎన్నికల అనంతరం వైసీపీలో చేరారు. ఆయన మళ్లీ టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో పులివెందుల నేతలతో సమావేశమయ్యారు. పార్టీని వీడివెళ్లిన వారు తిరిగి వచ్చినా.. అక్కడ పోటీచేసేది బీటెక్‌ రవి మాత్రమేనని ఆయన తేల్చేశారు. సతీశ్‌రెడ్డి వెళ్లాక నియోజకవర్గ బాధ్యతలను రవికే పార్టీ నాయకత్వం అప్పగించింది. ఆయన్నే ఇన్‌చార్జిగా ప్రకటించింది.

                                         

About Author