PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పుల్లారెడ్డి స్వీట్స్.. అధినేత మ‌న‌వ‌డి పై కేసు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పుల్లారెడ్డి స్వీట్స్‌ అధినేత జి. పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్‌ రెడ్డిపై కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో గృహ హింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏక్‌నాథ్ రెడ్డికి ఆయన భార్య ప్రగ్యారెడ్డికి మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏక్‌నాథ్ రెడ్డి.. ఆయన భార్యను ఇంట్లో నుంచి బయటకు రానివ్వడంలేదని తెలుస్తోంది. అంతేకాకుండా తన భార్యను ఇంట్లోనే ఉంచి బయటకు ఆమె బయటకు రాకుండా ఉండేందుకు రాత్రికే రాత్రే రూమ్‌కు అడ్డంగా ఓ గోడను కట్టి ఇంటికి తాళం వేసి పారిపోయాడని బాధితురాలు(ఏక్‌నాథ్‌ రెడ్డి భార్య) ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.

                                   

About Author