PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపండి..!

1 min read

– అధికారులను ఆదేశించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజిత్ భార్గవ్
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: అక్రమ మద్యం రవాణా, నాటుసారా తయారీకి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు సెబ్ పోలీసు అధికారులను ఆదేశించారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజిత్ భార్గవ్ . సోమవారం సాయంత్రం చీఫ్ సెక్రటరీ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సెబ్ మరియు పోలీస్ శాఖ అధికారులతో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజిత్ భార్గవ్ వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు.

కర్నూలు కలెక్టరేట్ లోని మిని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, అడిషనల్ ఎస్పి తుహిన్ సిన్హా జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా మరియు రెవిన్యూ) రామసుందర్ రెడ్డి, సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజిత్ భార్గవ్ మాట్లాడుతూ అక్రమ మద్యం, నాటుసారా నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలు, ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా, నాటు సారా తయారీ పై ప్రత్యేక నిఘా పెట్టి అక్రమార్కుల పైన ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇదివరకే ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో అక్రమ రవాణా జరుగుతుంది, నాటు సారా తయారీ, అమ్మకాలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

About Author