PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పుట్టా సుధాకర్ యాదవ్ సేవలు మరువలేనివి

1 min read

పల్లెవెలుగు వెబ్​, మైదుకూరు: పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు నియోజకవర్గానికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన ప్రజలకు ఎంతో సామాజిక సేవ చేయడం జరిగిందని, మళ్లీ ఆయన నేతృత్వంలో మైదుకూరు నియోజకవర్గానికి మహర్దశ రాబోతుందని జిల్లా తెలుగుదేశం మైనార్టీ జాయింట్ సెక్రటరీ కమలాపురం గౌస్ మొహిద్దిన్, తెలుగుదేశం నియోజవర్గ నాయకులు శ్రీను కొనియాడారు. సోమవారం పుట్ట సుధాకర్ యాదవ్ పుట్టినరోజు పురస్కరించుకొని, వేడుకలు మైదుకూరులో మైదుకూరు నియోజకవర్గం  టిడిపి మండలాల నాయకుల ఆధ్వర్యంలో   మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులోఘనంగా పుట్టా సుధాకర్ యాదవ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు , ఈ సందర్భంగా మిల్లు శీను ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా  సంయుక్త కార్యదర్శి కమలాపురం గౌస్ , లు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట సుధాకర్ యాదవ్, తెలుగుదేశం కార్యకర్తల పట్ల, ఎంతో ప్రేమ , అభిమానాలు చూపే వారని  ఆయన నాయకత్వంలో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తుందని, రాబోయే ఎన్నికలలో మైదుకూరులో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మ్రోగిస్తుందని వారు అభిప్రాయపడ్డారు, ఈ కార్యక్రమంలో కాజీపేట మండల టిడిపి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జెండాల మహబూబ్ బాషా, నీటి సంఘం ప్రెసిడెంట్ నంద్యాల సుబ్బయ్య యాదవ్, ప్రతాప్ రెడ్డి, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధర్ ,పూల రియాజ్ అహ్మద్ ,వి. ఎం. భాష ,షంషీర్ వీరితో పాటు కాజీపేట మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author