PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులకు నాణ్యమైన ఎరువులు విక్రయించాలి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ రుద్రవరం: ఎరువుల దుకాణాలలో రైతులకు నాణ్యమైన ఎరువులు విక్రయించాలని వ్యవసాయ అధికారి శ్రీకృష్ణ దుకాణాల యజమానులకు సూచించారు. మండల కేంద్రమైన రుద్రవరంలోని శ్రీజయశంకర్ ఏజన్సీ ఎరువుల దుకాణాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న 2022-2023 వ సంవత్సరానికి సంబందించిన ఎరువులు శాంపిల్ సేకరించి ల్యాబ్ కు పంపడం జరిగిందని ఏవో తెలిపారు. దుకాణాలలో నకిలీ ఎరువులు రైతులకు అంటగట్టి రైతులను ముంచరాదని రైతులకు న్యాయమైన ఎరువులు విక్రయించాలని దుకాణాల యజమానులను హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో విస్తరణ అధికారి రాజు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ శ్రావణి పాల్గొన్నారు.

About Author