PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ ఏపీ వీఆర్​ఓ’ కర్నూలు డివిజన్ అధ్యక్షుడిగా ఆర్​.నర్సరాజు ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం కర్నూలు డివిజన్​ అధ్యక్షుడిగా ఆర్​. నర్సరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని  సీక్యాంప్​ డ్రైవర్స్​ అసోసియేషన్ ​హాల్​లో ఆదివారం కమిటీ ఎన్నికలు నిర్వహించారు. వీఆర్వోల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.మౌళిబాషా ఎన్నికల అధికారిగా వ్యవహరించగా… సహాయ ఎన్నికల అధికారి నంద్యాల డివిజన్ అధ్యక్షుడు ఖాజా ఉస్సేన్ , జిల్లా కోశాధికారి శ్రీధర్, ఉపాధ్యక్షుడుగా మద్దిలేటి వ్యవహరించారు.  అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు.

ఎన్నికైన సభ్యులు వీరే…

కర్నూలు డివిజన్​ అధ్యక్షుడు ఆర్.నర్సరాజు,  కార్యదర్శి: ఆర్.ఎ. రాజు,  కోశాధికారి ఎస్.స్వామన్న, ఉపాధ్యక్షులు జబిఉల్లా, మద్దిలేటి,నాగలక్ష్మి జాయింట్ సెక్రటరీ భాగ్యరాజు, హరిరావు, సయ్యద్ ఖాదర్ బాషా ను ఎన్నకున్నారు. ఎన్నికల్లో  కర్నూలు డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

About Author