NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగరంగ వైభవంగా రఘురాం సునీతల వివాహం

1 min read

– వధూవరులను ఆశీర్వదించిన జడ్పీటీసీ, అధికారులు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని సుంకేసుల గ్రామ పంచాయతీ కార్యదర్శి రఘురాం మరియు సునీతల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.కర్నూలు పట్టణం బి క్యాంప్ లో ఉన్న శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ కళ్యాణమండపంలో గురువారం ఉదయం సుంకేసుల పంచాయతీ కార్యదర్శి బత్తులూరి రఘురాం,నల్లబోతుల సునీత(అలగనూరు పంచాయతీ కార్యదర్శి ఎన్ అనురాధ సోదరి)ల వివాహం వేద మంత్రోచ్చరణాల మధ్య ఘనంగా జరిగింది.ఈకార్యక్రమానికి మిడుతూరు మండల జడ్పీటీసీ పర్వత యుగంధర్ రెడ్డి,వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరు జనార్దన్ రెడ్డి,మాసపేట ఎల్లారెడ్డి,అలగనూరు చిన్న రామచంద్రారెడ్డి,సుంకేసుల సర్పంచ్ ఇందిరమ్మ,సుంకేసుల వైసీపీ నాయకులు రాంభూపాల్ రెడ్డి,సత్యం రెడ్డి, రాముడు,వెంకట్,జలకనూరు రామలింగేశ్వర రెడ్డి,రవి, మరియు ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి,ఏఓ దశరథ రామయ్య,సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి పంచాయతీ కార్యదర్శులు అశ్రఫ్ భాష,హసీన,శివకళ్యాణ్ సింగ్, రవీంద్రబాబు,సుధీర్,ఫరీద్,వినయ్ చంద్ర,విజయ కుమారి,బీజాన్ భి మరియు తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

About Author