PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైద్య క‌ళాశాల‌లో ర్యాగింగ్.. జాతీయ మెడిక‌ల్ క‌మిష‌న్ కు ఫిర్యాదు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గుంటూరు జిల్లా వైద్య కళాశాలలో ర్యాగింగ్ అంశం వెలుగులోకి వ‌చ్చింది. మొదటి సంవత్సరం విద్యార్థిని సీనియర్లు వేధింపులకు గురిచేశారు. కాలేజ్‌కి పొడుగు చేతుల చొక్కా మాత్రమే ధరించి రావాలని సీనియర్ల ఆర్డర్ వేశారు. దీంతో ఈ విషయాన్ని జాతీయ మెడికల్ కమిషన్‌కు మొదటి సంవత్సరం విద్యార్థి ఫిర్యాదు చేశాడు. దీనిపై వైద్య విద్య కళాశాల ప్రిన్సిపాల్‌ను జాతీయ మెడికల్ కమిషన్ వివరణ కోరింది. కాగా… ఫిర్యాదు చేసిన విద్యార్థి వివరాలను కమిషన్ గోప్యంగా ఉంచింది. ఈ క్రమంలో కాలేజీలో సీనియర్ విద్యార్ధులకు ప్రిన్సిపాల్ కౌన్సిలింగ్ ఇచ్చారు.

                                 

About Author