PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు రెండోసారి హాజరైన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్రం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సహా అన్ని సంస్థలనూ దుర్వినియోగం చేస్తోందని, కేంద్రానిది నిరంకుశ వైఖరని రాహుల్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తోన్న కాంగ్రెస్ నేతలందరినీ ఢిల్లీ పోలీసులు కింగ్స్‌వే పోలీస్ డిటెన్షన్ క్యాంపునకు తరలించారు. దీంతో రాహుల్‌ కాంగ్రెస్ నేతలతో అక్కడే మేధోమ‌థ‌నం నిర్వ‌హించారు.

                                                           

About Author