PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాహుల్ మతిలేని నేత !

1 min read

పల్లెవెలుగువెబ్ : రాహుల్ పై బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై లోక్‌సభలో రాహుల్ గాంధీ కేంద్రంపై చేసిన పలు విమర్శలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తిప్పికొట్టారు. రాహుల్ గందరగోళం మనిషి, మతిలేని నేత అంటూ విమర్శించారు. ”ఇండియా ఒక దేశం కాదని ఆయన చెబుతున్నారు. చైనా విజన్ చాలా స్పష్టంగా ఉందని అంటున్నారు. చైనాను సపోర్ట్ చేసేందుకు మీరు ఇక్కడకు వచ్చారా అని అడుగుతున్నాను. టిబెట్ సమస్యకు కారణం కాంగ్రెస్సే” అని ఆయన అన్నారు.

        

About Author