PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలోకి రాహుల్ పాద‌యాత్ర

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు ఏపీలో ప్రవేశించనుంది. ఉదయం 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోకి ఆయన అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగే రూట్లో ఏర్పాట్లను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్, కేంద్రమాజీమంత్రి జేడీ శీలం, కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కే రాజు, ఏఐసీసీ సెక్రటరీ రుద్రరాజు, ఏపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు గురునాథ్ రావు పరిశీలించారు. అనంతపురంలో రాహుల్ గాంధీకి వీరంతా ఘనస్వాగతం పలకనున్నారు. ఏపీలో 5 రోజుల పాటు రాహుల్ జోడో యాత్ర సాగుతుంది.

                                                  

About Author