PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సమతామూర్తి విగ్రహం పై రాహుల్ సంచలన వ్యాఖ్య !

1 min read

పల్లెవెలుగువెబ్ : హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహం పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు. 216 అడుగుల ఎత్తయిన ఈ విగ్రహాన్ని చైనాలో తయారు చేశారని, నవ భారతం చైనాపై ఆధారపడుతోందని వ్యాఖ్యానించారు. 135 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ఓ కంపెనీ ఈ విగ్రహాన్ని తయారు చేసింది. 2015 ఆగస్టులో దీనికి సంబంధించిన కాంట్రాక్టు కుదరగా, బంగారం, వెండి, రాగి, జింక్, టైటానియంలతో దీనిని తయారు చేశారు. 1,600 భాగాలుగా ఈ విగ్రహాన్ని తీసుకొచ్చారు. దీనిని 15 నెలలపాటు శ్రమించి ఈ భాగాలన్నిటినీ కలిపి, విగ్రహాన్ని నిర్మించారు.

        

About Author