PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైల్వే ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్: భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3115 పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఈస్టర్న్ రైల్వే. వేర్వేరు రైల్వే డివిజన్లలో ఈ పోస్టులున్నాయి. మొత్తం 7 డివిజన్లు, వర్క్‌షాప్స్‌లో ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 29 చివరి తేదీ. మెరిట్ లిస్ట్ 2022 డిసెంబర్‌లో విడుదలవుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి.

మొత్తం 3115 ఖాళీలు ఉండగా అందులో హౌరా డివిజన్- 659, లిలువా వర్క్‌షాప్- 612, సీల్దాహ్ డివిజన్- 440, కంచ్రపార వర్క్‌షాప్- 187, మాల్దా డివిజన్- 138, అసన్సోల్ వర్క్‌షాప్- 412, జమాల్‌పూర్ వర్క్‌షాప్- 667 పోస్టులున్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. విద్యార్హతల వివరాలు చూస్తే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు. ఎంపిక విధానం చూస్తే మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా https://rrcrecruit.co.in/eraprt2223rrc/ వెబ్‌సైట్ సంప్రదించాలి.

About Author