PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైల్వే జాబ్స్..రేపే చివ‌రి తేది

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప‌శ్చిమ మ‌ధ్య రైల్వే వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోండి. ఇప్పటికే ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. మ‌రిన్ని ఇత‌ర వివ‌రాల‌కు అధికారిక వెబ్ సైట్ ను సంద‌ర్శించ‌వ‌చ్చు.
సంస్థ: ప‌శ్చిమ మ‌ధ్య రైల్వే- భార‌త రైల్వే మంత్రిత్వ శాఖ‌
వివిధ విభాగాల్లో 716 ఖాళీలు ఉన్నాయి. కింద ఉద్యోగం పేరు, ఖాళీలు వ‌రుస‌గా ఇవ్వబ‌డిన‌వి.
ఉద్యోగం- ఖాళీలు-
ఎల‌క్రిషియ‌న్ – 135
ఫిట్టర్ – 102
వెల్డర్ – 43
పెయింట‌ర్ – 75
మెస‌న్ – 61
కార్పెంట‌ర్ – 73
ప్లంబ‌ర్ – 58
బ్లాక్ స్మిత్ – 63
వైర్ మెన్ – 50
కంప్యూట‌ర్ ప్రోగ్రామింగ్ అండ్ అసిస్టెంట్ – 10
మిషినిస్ట్ – 5
ట‌ర్నర్ – 2
ల్యాబ్ అసిస్టెంట్ – 2
క్రేన్ అసిస్టెంట్ – 2
డ్రాఫ్ట్స్ మెన్ – 5
విద్యార్హత‌: 10వ‌త‌ర‌గ‌తి, అప్రెంటిస్ విభాగాన్ని అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్ లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వ‌యోప‌రిమితి: 2021 ఏప్రిల్ 1నాటికి 15 నుంచి 24 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ద‌ర‌ఖాస్తు రుసుము: 100
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష లేదు. ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక‌
ద‌ర‌ఖాస్తుల ప్రారంభం: 26-3-2021
చివ‌రితేది : 30-4-2021

అధికారిక వెబ్ సైట్: https://wcr.indianrailways.gov.in/

About Author